AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రూల్స్ బ్రేక్.. ఢిల్లీలో ఒక్కరోజే 1,489 మందికి ఫైన్

దేశ రాజధాని నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ డీల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు

కరోనా రూల్స్ బ్రేక్.. ఢిల్లీలో ఒక్కరోజే 1,489 మందికి ఫైన్
Balaraju Goud
|

Updated on: Nov 16, 2020 | 10:03 PM

Share

దేశ రాజధాని నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ డీల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ నిబంధనలను పాటించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. కరోనా రూల్స్ పాటించని వారికి చలాన్లు విధిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 1,489 మంది ఉల్లంఘనులకు చలాన్లు విధించారు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి ఇప్పటివరకు జారీచేసిన మొత్తం చలాన్లలో మాస్క్‌లేకుండా రోడ్లపై తిరిగేవారు 1,460 మంది కాగా.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినవారు ముగ్గురు, భౌతికదూరం పాటించని వారు 21మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కరోనా వైరస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూస్తే.. 5,21,412 మందికి చలాన్లు జారీచేశారు. వారిలో మాస్క్‌లు ధరించనివారు 5,17,011 మంది కాగా.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినవారు 3,325 మంది, భౌతికదూరం పాటించని వారు 36,674 మంది ఉన్నట్టు పోలీసులు ప్రకటనలో తెలిపారు.