వేతనం రూ.300.. పన్ను రూ.కోటి కట్టాలని ఐటీ శాఖ నోటీస్!

| Edited By:

Jan 16, 2020 | 4:54 PM

పూరి గుడిసెల్లో నివసించే పేదలకు లక్షల్లో కరెంట్ బిల్లు, కటిక పేదలకు ఐటీ నోటీసు ఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఓ రోజువారీ కూలీకి రూ. కోటి పన్ను కట్టాలని నోటీసొచ్చింది. అది చూసి అతడు నిర్ఘాంతపోయాడు. అంబివాలిలోని ఒక మురికివాడలో ఉంటున్న రోజువారీ కూలీ కార్మికుడు, నోట్ల రద్దు సమయంలో తన ఖాతాలో జమ చేసిన రూ .58 లక్షలకు పన్నుగా రూ. 1.05 కోట్లు చెల్లించాలని ఆదాయపు […]

వేతనం రూ.300.. పన్ను రూ.కోటి కట్టాలని ఐటీ శాఖ నోటీస్!
Follow us on

పూరి గుడిసెల్లో నివసించే పేదలకు లక్షల్లో కరెంట్ బిల్లు, కటిక పేదలకు ఐటీ నోటీసు ఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఓ రోజువారీ కూలీకి రూ. కోటి పన్ను కట్టాలని నోటీసొచ్చింది. అది చూసి అతడు నిర్ఘాంతపోయాడు. అంబివాలిలోని ఒక మురికివాడలో ఉంటున్న రోజువారీ కూలీ కార్మికుడు, నోట్ల రద్దు సమయంలో తన ఖాతాలో జమ చేసిన రూ .58 లక్షలకు పన్నుగా రూ. 1.05 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. అయితే రోజుకు రూ .300 సంపాదిస్తున్నట్లు చెప్పుకునే భావుసాహెబ్ అహిర్ ఐ-టి నోటీసు అందుకున్న తర్వాత పోలీసులను సంప్రదించి, ఆ మొత్తాన్ని జమ చేసిన ఖాతా గురించి తనకు తెలియదని చెప్పారు. నకిలీ పత్రాలతో ఖాతా సృష్టించబడి ఉండవచ్చని అహిరే పోలీసులకు వివరించాడు.

2016 నోట్ల రద్దు సమయంలో ఒక ప్రైవేట్ బ్యాంకులో తన ఖాతాలో చేసిన డిపాజిట్ల గురించి సెప్టెంబరులో తనకు మొదటి నోటీసు వచ్చిందని చెప్పారు. కాగా.. ఖాతా తెరవడానికి ఉపయోగించిన పాన్ నంబర్ తనదే అయినప్పటికీ, ఫోటో, సంతకాలు నకిలీవని చెప్పాడు. జనవరి 7 న 1.05 కోట్ల రూపాయలు చెల్లించమని టాక్స్ నోటీసు అందుకున్నట్లు అహిరే చెప్పారు. అహిరే ఫిర్యాదు తరువాత, పోలీసులు దర్యాప్తునకు ఆదేశించారు.