AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Outbreak: అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట..!

కరోనా వైరస్(కోవిడ్ 19)తో ప్రపంచదేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. దీనితో చైనా ప్రభుత్వం సూపర్ ప్లాన్ ఆలోచించింది.కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటే.. వారికి ఆ వైరస్ ఉన్నట్లు రుజువైతే 10000 యువాన్లలను(ఇండియన్ కరెన్సీలో లక్ష రూపాయలు) ఇస్తామని ప్రకటించింది...

Coronavirus Outbreak: అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట..!
Ravi Kiran
|

Updated on: Feb 29, 2020 | 2:30 PM

Share

Coronavirus Outbreak: కరోనా వైరస్(కోవిడ్ 19)తో ప్రపంచదేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలను ఈ వైరస్ చుట్టేసింది. దీన్ని నివారించడానికి సత్వర చర్యలు చేపడుతున్నా కూడా అంతకంతకూ మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. అంతేకాకుండా దేశాల ఆర్ధిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతున్నాయి.

ఇప్పటికే 57 దేశాలకు పాకిన కరోనా వైరస్‌‌తో ప్రపంచవ్యాప్తంగా 83,877 కేసులు నమోదు కాగా.. అందులో 2,869 మంది మృతి చెందారు. మిగతా 44,194 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే చైనాలో ఈ వైరస్ ప్రభావం మరీ ఘోరంగా ఉందని చెప్పాలి. కరోనా బారిన పడి రోజుకు ఎంతమంది చనిపోతున్నారో.? కొత్తగా ఎంతమందికి ఈ వైరస్ వ్యాపిస్తోందో.? ఎప్పుడు అదుపులోకి వస్తుందన్న విషయాలు ఏవి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడి అధికారులు. ఒక్క వుహాన్ మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.

ఇక చైనాలో ఇప్పటికే కరోనా మహమ్మారితో 2 810 ప్రాణాలు కోల్పోగా.. సుమారు 82,500 మంది ఈ వైరస్‌తో బాధపడుతున్నారు. కరోనా వల్ల చైనా మొత్తం అతలాకుతలం అయిపోయింది. జనజీవనం స్తంభించింది. అన్ని ప్రాంతాలూ డెడ్ సిటీస్‌గా మారిపోయాయి. అక్కడి అధికారులు కరోనాను నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆ వైరస్‌కు భయపడి ప్రజలు ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారట. దానికి చెక్ పెట్టేందుకే చైనా ప్రభుత్వం సూపర్ ప్లాన్ ఆలోచించింది.

కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటే.. వారికి ఆ వైరస్ ఉన్నట్లు రుజువైతే 10000 యువాన్లలను(ఇండియన్ కరెన్సీలో లక్ష రూపాయలు) ఇస్తామని ప్రకటించింది. చూశారా డ్రాగన్ సిటీ అధికారుల తెలివి. వాళ్ల ముందు మిగిలిన దేశాలు బలాదూర్ అని మరోసారి నిరూపించారు.

For More News: 

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే ‘దీప’ వెండితెర ఎంట్రీ.!

కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…