దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం దాల్చుతుంది. లాక్ డౌన్ అమలవుతున్నప్పటికి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 73 మంది ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1993 మంది వైరస్ సోకింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
మొత్తం కేసులు: 35043
యాక్టివ్ కేసులు: 25007
చనిపోయినవారు: 1147
కోలుకున్నవారు: 8889