అందుబాటులోకి వచ్చిన కంప్లైంట్ బాక్స్

తెలంగాణ ప్రభుత్వాధికారులు వినూత్నంగా అలోచన చేశారు. తమను కలిసేందుకు వచ్చే అర్జీదారులు నిరాశ చెందకుండా ఉండేందుకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ కేసుల దృష్టిలో పెట్టుకుని బాధితులను నేరుగా కలిసే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందుబాటులోకి వచ్చిన కంప్లైంట్ బాక్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 16, 2020 | 7:03 PM

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాతో జనం అల్లాడిపోతున్నారు. ఎ రూపంలో వైరస్ అంటుతుందోనన్న భయం వెంటాడుతోంది. ఎ రూపంలో వచ్చి సోకితుందోనన్న టెన్షన్. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని కరోనా నియంత్రణకు జనం వింత వింత పద్ధతులు అచరిస్తున్నారు. ప్రజలకు అందించే సేవలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం భౌతిక దూరం పాటిస్తూ సదుపాయాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వాధికారులు వినూత్నంగా అలోచన చేశారు. తమను కలిసేందుకు వచ్చే అర్జీదారులు నిరాశ చెందకుండా ఉండేందుకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ కేసుల దృష్టిలో పెట్టుకుని బాధితులను నేరుగా కలిసే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెలంగాణలోని చాలా జిల్లాల్లో తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు. ప్రతి కార్యాలయంలో మూడు పెట్టెలను తేదీల వారీగా తయారు చేసి ప్రత్యేక గదిలో భద్రపరుస్తున్నారు. అత్యవసరమైన దరఖాస్తులను మాత్రం స్కాన్‌ చేసి పంపించాలని క్రిందిస్థాయి అధికారులకు సూచిస్తున్నారు. దీనివల్ల ఫిర్యాదుదారులతో పాటు సిబ్బందికి రక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అత్యవసరమైతే తమ దరఖాస్తులను పంపించేందుకు వీలుగా వాట్సాప్‌ నంబర్లు, ఈమెయిల్‌ చిరునామాను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారికి దూరంగా ఉంటూనే ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నామని అధికారులు తెలిపారు.