AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలిన గోల్కొండ కోట ప్రహారీ గోడ

భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూసీ నది వందేళ్ల తరువాత పోటెత్తింది. రెండు రోజులపాటు కురిసిన కుండపోత వర్షాలకు వందలాది కాలనీలు నీట మునిగాయి.

కూలిన గోల్కొండ కోట ప్రహారీ గోడ
Balaraju Goud
|

Updated on: Oct 17, 2020 | 9:48 AM

Share

భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూసీ నది వందేళ్ల తరువాత పోటెత్తింది. రెండు రోజులపాటు కురిసిన కుండపోత వర్షాలకు వందలాది కాలనీలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 30 మంది ప్రాణాలను కోల్పోయారు. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. ఈ భారీ వర్షాల ప్రభావం పురాతన కట్టడాలపై పడింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన గోల్కొండ గోడ కూడ కదిలిపోయింది. భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. కొవిడ్‌ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే, ప్రహరీ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాని ఆ గోడ కుప్పకూలిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండిః తెలంగాణకు పొంచి ఉన్న మరో వానగండం