Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జ‌గన్ కీల‌క‌ నిర్ణయం..సమగ్ర భూసర్వే వేగ‌వంతం

ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సమగ్ర భూసర్వేను వెంటనే ప్రారంభించాల‌ని అధికారులను ఆదేశించారు. మూడు విడ‌త‌ల్లో స‌ర్వే ప‌నులు పూర్తి చెయ్యాల‌ని.. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అన్న విష‌యం అంద‌రూ మైండ్ లో పెట్టుకోవాల‌ని సూచించారు.

సీఎం జ‌గన్ కీల‌క‌ నిర్ణయం..సమగ్ర భూసర్వే వేగ‌వంతం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2020 | 4:23 PM

ఏపీ సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సమగ్ర భూసర్వేను వెంటనే ప్రారంభించాల‌ని అధికారులను ఆదేశించారు. మూడు విడ‌త‌ల్లో స‌ర్వే ప‌నులు పూర్తి చెయ్యాల‌ని.. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అన్న విష‌యం అంద‌రూ మైండ్ లో పెట్టుకోవాల‌ని సూచించారు. మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని సర్వే చేయాలన్న ముఖ్య‌మంత్రి.. సర్వే రాళ్ల ఖర్చు కూడా స‌ర్కారే భ‌రిస్తుంద‌న్నారు. క్యాంపు ఆఫీసులో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ రివ్యూ చేశారు. ఈ సమావేశంలో సీఎం చీఫ్ అడ్వైజ‌ర్ అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి..సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కాగా ఈ భూ స‌ర్వే కోసం తీస‌కుంటున్న చ‌ర్య‌ల‌ను సీఎంకు అధికారులు వివ‌రించారు. వీటిలో ఏమైనా వివాదాలు వ‌స్తే ప‌రిష్కారం కోసం మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్‌ కోర్టులు వ్య‌వ‌హరిస్తాయ‌ని.. దాంతో రికార్డుల ప్రక్షాళన సుల‌భ‌త‌రం అవుతుంద‌ని సీఎంకు చెప్పారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్‌ పద్ధతిలో భద్రపరిచి, ఎన్‌క్రిప్ట్‌ చేస్తామని తెలిపారు. ఈ స‌మాచారాన్ని ఎవ‌రూ దుర్వినియోగం చేయ‌కుండా… మూడు నాలుగు చోట్ల భద్రపరుస్తామని వెల్ల‌డించారు. భూ అమ్మ‌కాలు, బ‌ద‌లాయింపులు కూడా ఈజీగా ఉంటాయని, రిజిస్ట్రేషన్ల ఆటో మ్యుటేషన్‌ జరుగుతుందని వివ‌రించారు అధికారులు. సమగ్ర భూ సర్వేకోసం వినియోగిస్తున్న కార్స్‌ నెట్‌వర్క్‌ ఏవిధంగా వ‌ర్క్ చేస్తుందో సీఎంకు వివరించారు.