లాక్డౌన్పై సీఎం కేసీఆర్ సమీక్ష
కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. లాక్డౌన్ నిబంధనలపై రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. లాక్డౌన్ కొనసాగించాలా? లేదా? అనే అంశంపై చర్చించారు.

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. లాక్డౌన్ నిబంధనలపై రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. లాక్డౌన్ కొనసాగించాలా? లేదా? అనే అంశంపై చర్చించారు. అయితే లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సడలింపు ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. మద్యం అమ్మకాలకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఉత్తర్వులు, రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. అదేవిధంగా వలస కార్మికుల తరలింపుపైనా సీఎం సమీక్ష జరిపారు.
Also Read: గుడ్ న్యూస్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్.. భారత్ నుంచే..!