AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష […]

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
Balaraju Goud
| Edited By: |

Updated on: May 27, 2020 | 9:29 PM

Share

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత ఆదాయంతో పాటు ఫించన్ల చెల్లింపులు, ఉద్యోగుల వేతనాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈనెల కూడా పేదలకు 12 కిలోల రేషన్ బియ్యాన్ని యథావిదిగా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పింఛనర్లకు మాత్రం మొత్తం పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఇక రాష్ట్రానికి నెలకు రూ. 12 వేల కోట్ల మేర ఆదాయం రావాల్సిన ఉండగా.. మే నెలలో కేవలం రూ.3,100 కోట్లు (కేంద్రం నుంచి వచ్చిన వాటాతో కలిపి) మాత్రమే వచ్చాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయకపోవడంతో ఏడాదికి దాదాపు రూ. 37,400 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అధికారులు వివరించారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితిలో లేమని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పూర్తిగా చెల్లించినట్లయితే రూ.3 వేల కోట్లకుపైగా అవుతుందని.. ఖజానా ఖాళీ అవుతుందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నిలిపివేయాలని అధికారులు సూచించారు. ఇక ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం,ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలను మే నెలలో కూడా కోత కొనసాగుతుంది.

Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో