AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష […]

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
Balaraju Goud
| Edited By: |

Updated on: May 27, 2020 | 9:29 PM

Share

కరోనావైరస్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకి భారీగా గండి పడింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో రాష్ట్ర ఖజనాకి రావల్సిన పన్నులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర నుంచి రావల్సిన పన్నుల్లోనూ కోత పడింది. దీంతో పేదలకు చెల్లించాల్సిన ఫించన్లను యథావిధిగా కొనసాగించి.. ప్రభుత్వ ఉద్యోగుల మే నెల జీతాల్లో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత ఆదాయంతో పాటు ఫించన్ల చెల్లింపులు, ఉద్యోగుల వేతనాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈనెల కూడా పేదలకు 12 కిలోల రేషన్ బియ్యాన్ని యథావిదిగా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పింఛనర్లకు మాత్రం మొత్తం పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఇక రాష్ట్రానికి నెలకు రూ. 12 వేల కోట్ల మేర ఆదాయం రావాల్సిన ఉండగా.. మే నెలలో కేవలం రూ.3,100 కోట్లు (కేంద్రం నుంచి వచ్చిన వాటాతో కలిపి) మాత్రమే వచ్చాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయకపోవడంతో ఏడాదికి దాదాపు రూ. 37,400 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుందని అధికారులు వివరించారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితిలో లేమని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పూర్తిగా చెల్లించినట్లయితే రూ.3 వేల కోట్లకుపైగా అవుతుందని.. ఖజానా ఖాళీ అవుతుందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నిలిపివేయాలని అధికారులు సూచించారు. ఇక ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం,ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలను మే నెలలో కూడా కోత కొనసాగుతుంది.

Follow Us
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే