మమత బెంగాల్ టైగర్- చంద్రబాబు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతుగా బెంగాల్ లో ఆయన రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. తొలిరోజు ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బెంగాల్ టైగర్తో పోల్చారు. బీజేపీయేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారన్నారు. మే 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. బెంగాల్ అభివృద్ధి కోసం తృణమూల్ కాంగ్రెస్కు ప్రజలంతా మద్దతివ్వాలని విజ్ఞప్తి […]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతుగా బెంగాల్ లో ఆయన రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. తొలిరోజు ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బెంగాల్ టైగర్తో పోల్చారు. బీజేపీయేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారన్నారు. మే 23 తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. బెంగాల్ అభివృద్ధి కోసం తృణమూల్ కాంగ్రెస్కు ప్రజలంతా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పారదర్శకత కోసమే తాము పోరాటం చేస్తున్నామని, 50శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఈసీఐని కోరుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఓటు వేశాక అందరూ వీవీప్యాట్ స్లిప్ని సరిచూసుకోవాలన్నారు. మనం వేసిన పార్టీకే ఓటు పడుతుందా లేదా అనేది చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఓటింగ్ సమయంలో ఎవరైనా తప్పుచేస్తే నిలదీయాలన్నారు.