ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

చిత్తూరు జిల్లా తొట్టంబేడు రాజకీయ పార్టీల పాతకక్ష్యలు భగ్గుమన్నాయి. వైసీపీ – టీడీపీ నేతల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో టీడీపీ నేత గోపితో సహా ఇద్దరికి గాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోయిన గోపిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపి మృతిపై స్పందించిన జిల్లా టీడీపీ నేతలు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
Follow us

|

Updated on: May 30, 2020 | 7:52 PM

చిత్తూరు జిల్లా తొట్టంబేడు రాజకీయ పార్టీల పాతకక్ష్యలు భగ్గుమన్నాయి. వైసీపీ – టీడీపీ నేతల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో టీడీపీ నేత గోపితో సహా ఇద్దరికి గాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోయిన గోపిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపి మృతిపై స్పందించిన జిల్లా టీడీపీ నేతలు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా నేతలు పులివర్తి నాని, అమర్నాథరెడ్డి గోపి కుంటుంబాన్ని పరామర్శించి తమ సానుభూతి వ్యక్తం చేశారు.