chaysam pics viral: వైరల్‌గా మారిన సమంత, నాగచైతన్య ఫొటోలు.. న్యూ ఇయర్ వేడుక కోసమే వీరి ప్రయాణం..

|

Dec 29, 2020 | 7:50 PM

కొత్తేడాదిని సంతోషంగా ఆహ్వానించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎవరి స్థాయికి తగ్గట్లు వారు ప్లాన్‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి కానీ..

chaysam pics viral: వైరల్‌గా మారిన సమంత, నాగచైతన్య ఫొటోలు.. న్యూ ఇయర్ వేడుక కోసమే వీరి ప్రయాణం..
Follow us on

chaysam going for new year: కొత్తేడాదిని సంతోషంగా ఆహ్వానించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎవరి స్థాయికి తగ్గట్లు వారు ప్లాన్‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి కానీ.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు విధించలేదు.


ఇక తాజాగా న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేయడానికి టాలీవుడ్ అందాల జంట నాగచైతన్య, సమంత టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మంగళవారం ఈ జంట రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్‌లో సందడి చేసింది. గోవాకు వెళుతోన్న సందర్భంలో ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఇక ఈ ఫొటోల్లో చై,సామ్ జంట చూడముచ్చటగా కనిపిస్తోంది. గ్రే, బ్లాక్ దుస్తుల్లో మాస్కు ధరించి సమంత కనిపించగా.. వైట్ టీ షర్టులో చైతన్య కనిపించాడు. ఇదిలా ఉంటే ఈ జంటకు గోవా అంటే చాలా ఇష్టమనే విషయం తెలిసిందే. చైతన్య, సమంత గోవాలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు, అలాగే సమయం దొరికినప్పుడల్లా ఈ జంట గోవాలో షికార్లు కొడుతుంటుంది.


Also read: Family man2: పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు.. ఫ్యామిలీ మ్యాన్ వచ్చేది అప్పుడేనా.?