AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్ పోర్టుల్లో జర భద్రం ! సెక్యూరిటీ కట్టుదిట్టం !

దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందు వైమానిక ఉగ్రవాద సంబంధ దాడులు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ హెచ్ఛరికలు జారీ అయిన వేళ… ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పూనుకొంది. పౌర విమానయాన శాఖ ఈ మేరకు ఓ సెక్యూరిటీ అడ్వైజరీ ని విడుదల చేస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నివారించేందుకు సెక్యూరిటీ ప్రొటొకాల్స్ కు ఖఛ్చితంగా కట్టుబడి ఉండాలని సూచించింది. ముఖ్యంగా విమానాశ్రయాలు సహా కీలక ప్రాంతాల్లో తగినంత భద్రత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను […]

ఎయిర్ పోర్టుల్లో జర భద్రం ! సెక్యూరిటీ కట్టుదిట్టం !
Anil kumar poka
|

Updated on: Aug 08, 2019 | 1:51 PM

Share

దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముందు వైమానిక ఉగ్రవాద సంబంధ దాడులు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ హెచ్ఛరికలు జారీ అయిన వేళ… ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పూనుకొంది. పౌర విమానయాన శాఖ ఈ మేరకు ఓ సెక్యూరిటీ అడ్వైజరీ ని విడుదల చేస్తూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నివారించేందుకు సెక్యూరిటీ ప్రొటొకాల్స్ కు ఖఛ్చితంగా కట్టుబడి ఉండాలని సూచించింది. ముఖ్యంగా విమానాశ్రయాలు సహా కీలక ప్రాంతాల్లో తగినంత భద్రత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు కోరారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటన చేసిన అనంతరం.. ఉగ్రవాద వర్గాలు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను సాఫ్ట్ టార్గెట్లుగా చేసుకోవచ్ఛునని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కోల్ కతా తదితర మెట్రోపాలిటన్ నగరాల్లో కనీవినీ ఎరుగని భద్రత కల్పించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించింది. ఈ మేరకు విమానాశ్రయాలకు కనీసం ఒక కిలో మీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేస్తారు. ప్రతి ప్రయాణికుడిని, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయి. విజిటర్ల ఎంట్రీపై ఈ నెల 10 నుంచి ఆంక్షలు విధించారు. కేవలం ప్రయాణికులను మాత్రమే ఎయిర్ పోర్టుల్లోకి అనుమతిస్తారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం ఒక వారం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండవచ్చు. హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అన్ని ఎయిర్ పోర్టుల్లో సి ఐ ఎస్ ఎఫ్ తో బాటు క్విక్ రెస్పాన్స్ టీమ్ ని నియమిస్తున్నారు. ఈ టీమ్ ఏ అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలోకి దిగుతుంది.