గత కొద్ది రోజులుగా దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. హాత్రాస్ ఆత్యాచార ఘటన తరువాత దేశంలో పలు చోట్ల గ్యాంగ్ రేప్ కేసుల సంఖ్య గణనీయంగా నమోదయ్యాయి. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన బాధితురాలికి న్యాయం జరగలేదని ఇటీవల ఆమె తండ్రి ఆత్మహత్యయత్నానికి సైతం పాల్పడ్డాడు. ఇలాంటి ఘటన నేపథ్యంలో మహిళల పట్ల భద్రతా భరోసా కల్పించేందుకు కేంద్రం మరోసారి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై జరిగే నేరాలను ఏమాత్రం ఉపేక్షించేంది లేదని స్పష్టం చేసింది. అంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని సూచింది. ముఖ్యంగా అత్యాచారం కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లైంగిక దాడుల కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అని, అంతేగాక ఈ కేసుల్లో 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించింది. ఈ నిబంధనలను పోలీసులు కచ్చితంగా పాటించి బాధితులకు పూర్తి న్యాయం చేకూర్చాలని కేంద్రం వెల్లడింది. అలాగే నిబంధనలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయని గుర్తుచేసింది. ఈ మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని చట్టాలను గుర్తుచేస్తూ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలుః