AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ. 2,498 కోట్లు..

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన చెల్లింపుల విషయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ..ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మంత్రుల ఆదేశాలతో ఈ విషయంపై ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా… ఆహార, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జరపాల్సిన చెల్లింపులకుగానూ.. కేంద్ర ప్రభుత్వం రూ. 2,498.89 కోట్లను శుక్రవారం ఎఫ్‌సీఐకి విడుదల చేసింది. ఎఫ్‌సీఐ ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు […]

ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ. 2,498 కోట్లు..
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2020 | 9:12 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన చెల్లింపుల విషయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ..ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మంత్రుల ఆదేశాలతో ఈ విషయంపై ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా… ఆహార, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జరపాల్సిన చెల్లింపులకుగానూ.. కేంద్ర ప్రభుత్వం రూ. 2,498.89 కోట్లను శుక్రవారం ఎఫ్‌సీఐకి విడుదల చేసింది. ఎఫ్‌సీఐ ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతికి కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ తెలియజేయగా..ఆయన హర్షం వ్యక్తం చేశారు.