AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్మకు మరోషాక్…సీఈసీ భారీ జరిమానా

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఆయన్ను ఎక్కువగా వివాదాస్పద దర్శకుడుగా పిలుచుకుంటారు. అంతా నా ఇష్టం అనే ఆర్టీవీకి తాజాగా మరో షాక్ తగిలింది. సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ సెల్ సీఈసీ భారీ జరిమానా విధించింది.

వర్మకు మరోషాక్...సీఈసీ భారీ జరిమానా
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2020 | 6:21 PM

Share

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్. ఆయన్ను ఎక్కువగా వివాదాస్పద దర్శకుడుగా పిలుచుకుంటారు. ఆయన ఏది చేసినా పతాక శీర్షికలకు ఎక్కాల్సిందే. ‘నాకు ఇష్టమొచ్చినట్టు నేను తీస్తా..నాకు ఇస్టమొచ్చినట్టు నేను చేస్తా’ ఇది వర్మ రొటీన్‌గా చెప్పే డైలాగ్. అయితే, అంతా నా ఇష్టం అనే ఆర్టీవీకి తాజాగా మరో షాక్ తగిలింది. సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ సెల్ సీఈసీ భారీ జరిమానా విధించింది.

ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము చూస్తూ..ఊరుకోబోమని వర్మపై సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ‘పవర్ స్టార్’ పోస్టర్లను పెట్టడంపై కన్నెర జేసింది. ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా 30కి పైగా పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పోస్టర్లకు సంబంధించి డీఆర్ఎఫ్, సీఈసీ పర్మిషన్ తీసుకోలేదని తనిఖీల్లో తేలింది. మరోవైపు ఈ పోస్టర్లపై అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో, అనుమతి లేని పోస్టర్లకు రూ. 88 వేల జరిమానా విధించారు. జీహెచ్ఎంసీ కూడా పోస్టర్లకు సంబంధించి రూ. 4వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

read more:http://క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రజత్ భాటియా https://tv9telugu.com/domestic-stalwart-rajat-bhatia-announces-retirement-from-cricket-285119.html