యస్ బ్యాంక్ కుంభకోణం.. వాధ్వాన్ సోదరుల అరెస్ట్..!
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. యస్ బ్యాంకు కుంభకోణంలో పాత్రధారులగా భావిస్తున్న డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన ధీరజ్, కపిల్ వాధ్వాన్లను ఆదివారం సీబీఐ అరెస్ట్
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. యస్ బ్యాంకు కుంభకోణంలో పాత్రధారులగా భావిస్తున్న డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన ధీరజ్, కపిల్ వాధ్వాన్లను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసింది. మహాబలేశ్వర్లోని వారి బంగళాలో అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. రేపు (సోమవారం) వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీ కోరనుంది. వీరిద్దరితోపాటు కుటుంబ సభ్యులు ఈ నెల 23 వరకు 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉన్నట్టు సీబీఐ తెలిపింది.
కాగా.. మహాబలేశ్వర్లో విహారానికి వచ్చిన వీరిపై సీబీఐ ఇటీవల అరెస్ట్ వారెట్ జారీ చేసింది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయవద్దన్న లాయర్ విజ్ఞప్తితో ఏప్రిల్ 18న అరెస్ట్పై కోర్టు స్టే విధించింది. మే 5 వరకు వారిని అరెస్ట్ చేయకుండా కోర్టు స్టే ఉపశమనం కల్పించింది. అరెస్ట్ వారెంట్ను ఎత్తివేయాల్సిందిగా కోరుతూ ప్రత్యేక కోర్టును సీబీఐ ఆశ్రయించడంతో శనివారం వాధ్వాన్ల స్టేను రద్దు చేసింది. దీంతో శనివారం మధ్యహ్నం ముంబై నుంచి సీబీఐ బృందం సతారా చేరుకుని వారిని అరెస్ట్ చేసినట్టు సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.