డయాగ్నస్టిక్స్ సెంటర్ గా మారిన ‘ భూత గృహం ‘..

|

Dec 30, 2019 | 5:12 PM

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గత ఏడాది జులైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘోర ఉదంతం గుర్తుందా ? ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. మహిళలు, పురుషులు, పిల్లలతో సహా తమ ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. వీరిలో ఓ వృధ్ధ మహిళ డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మూఢాచారాలను విశ్వసించే ఆ కుటుంబ సభ్యులు కళ్ళకు గంతలు కట్టుకుని, కాళ్లకు తాళ్లు బిగించుకుని […]

డయాగ్నస్టిక్స్ సెంటర్ గా మారిన  భూత గృహం ..
Follow us on

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో గత ఏడాది జులైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘోర ఉదంతం గుర్తుందా ? ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. మహిళలు, పురుషులు, పిల్లలతో సహా తమ ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. వీరిలో ఓ వృధ్ధ మహిళ డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మూఢాచారాలను విశ్వసించే ఆ కుటుంబ సభ్యులు కళ్ళకు గంతలు కట్టుకుని, కాళ్లకు తాళ్లు బిగించుకుని బలవన్మరణం పొందారు. వీరిది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ రిపోర్టు ధృవీకరించింది. వీరి సామూహిక ఆత్మహత్యలతో ఆ ఇంటివైపు రావడానికే స్థానికులు భయపడుతూ వచ్చారు. ఆ వీధి వంక చూడడానికే జంకేవారు. అయితే మూఢాచారాలను నమ్మని మోహన్ సింగ్ అనే ఓ డాక్టర్. ఆ ఇంటిని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ గా మార్చేశాడు.

ఆత్మలు, దెయ్యాలంటే తాను నమ్మబోనని, అందుకే ఈ ఇంటిని ఇలా మార్చేశానని చెబుతున్నాడు. తనవద్దకు వచ్ఛే రోగులకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదని ఆయన చెప్పాడు. పైగా ఈ ఇల్లు మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండడం తనకెంతో నచ్చిందని ఆయన అన్నాడు. అయితే ఈ డాక్టర్ తాను హేతువాదినని చెబుతున్నా ఆ ఇంటి దగ్గర ఓ హిందూ బాబా ‘ దుష్ట శక్తిని పారదోలేందుకు ‘…. ‘ హవనం ‘ చేస్తూ కనిపించడం విశేషం. .