AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కోసం వాంఖేడ్ స్టేడియం

కరోనా దెబ్బకి కాదేదీ క్వారెంటైన్ సెంటర్ అన్నట్లుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలమైన అన్నీ అవకాశాలను వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగానూ కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కోవిడ్ 19 బాధితులతో ముంబై ఆస్పత్రులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. దీంతో బృహన్‌ ముంబై […]

కరోనా కోసం వాంఖేడ్ స్టేడియం
Balaraju Goud
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 8:37 PM

Share

కరోనా దెబ్బకి కాదేదీ క్వారెంటైన్ సెంటర్ అన్నట్లుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలమైన అన్నీ అవకాశాలను వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగానూ కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కోవిడ్ 19 బాధితులతో ముంబై ఆస్పత్రులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. దీంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని చారిత్రాత్మక వాంఖేడ్ స్టేడియాన్ని క్వారెంటైన్‌ కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. వీలైనంత తొందరగా మైదానాన్ని తమకు అప్పగించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆదేశించింది. ఈ మేరకు ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌ (ఎంసీఏ)కు ఓ లేఖ రాశారు.

మహారాష్ట్రంలో ఇప్పటి వరకే 29,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… వైరస్‌ సోకి 1,068 మంది మృత్యువాత పడ్డారు. అత్యధిక కేసులు ముంబైలోనే నమోదవుతున్నాయి. దీంతో ముంబై కార్పోరేషన్ తమ పరిధిలోని ఆస్పత్రులతో పాటు హోటల్స్‌, లాడ్జ్‌, క్లబ్స్‌, కాలేజీలు, పంక్షన్‌ హాల్స్‌ తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. వీటిలో కరోనా బాధితులకు వైద్యం అందించడంతో పాటు వారికి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వసతి కల్పించాలని బీఎంసీ భావిస్తోంది.

Follow Us
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
ప్రతిరోజూ కేవలం 6 నిమిషాలు ఏదైనా పుస్తకం చదవండి..! ఇది మీ శరీరం,
ప్రతిరోజూ కేవలం 6 నిమిషాలు ఏదైనా పుస్తకం చదవండి..! ఇది మీ శరీరం,
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌
శ్రీవారి దర్శనం పేరుతో మోసాలుచేసే కేటుగాళ్లు అరెస్ట్‌