ఇవాళ భద్రాద్రికి చినజీయర్స్వామి, రామానుజ జీయర్ స్వామి
ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి, ఆహోబిల రామానుజ జీయర్స్వామి శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు.
కరోనా పుణ్యామాని దేవాలయాలు సైతం మూతపడ్డాయి. కేంద్ర సడలింపులు ఇవ్వడంతో తిరిగి తిరిగి తెరుచుకున్న ఆలయాలు ప్రత్యేక పూజలతో మళ్లీ కళకళలాడుతున్నాయి. ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి, ఆహోబిల రామానుజ జీయర్స్వామి శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని..ప్రత్యేక పూజలు చేయనున్నారు. చాలా కాలం విరామం తర్వాత వారిరువురు భద్రాద్రికి రానున్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన విశ్రాంత ప్రధాన అర్చకులు కోటి రామకృష్ణమాచార్యులు, జనార్దన్ భట్టార్ కుటుంబ సభ్యులను చినజీయర్స్వామి, రామానుజ జీయర్ పరామర్శించనున్నట్లు సమాచారం.