AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిగేల్ జిగేల్ మాస్క్.. ఎల్ఈడీ మాస్క్ వైరల్..

వినూత్న అకారాల్లో మాస్క్ లను తయారు చేస్తున్నారు. కొందరు బంగారంతో తయారు చేస్తే, మరికొందరు వెండితో మాస్క్ రూపొందిస్తున్నారు. మరికొందరు వివిధ బొమ్మల రూపాల్లో తయారు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన ఆలోచనకు తగ్గట్లు ఎల్ఈడీ మాస్క్ ను తీర్చిదిద్దాడు.

జిగేల్ జిగేల్ మాస్క్.. ఎల్ఈడీ మాస్క్ వైరల్..
Balaraju Goud
|

Updated on: Jul 20, 2020 | 4:49 PM

Share

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ నుంచి తప్పించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇతరుల నుంచి వైరస్ వ్యాపించకుండా రకరకాల మాస్క్ లు ధరిస్తున్నారు. జువ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లు వినూత్న అకారాల్లో మాస్క్ లను తయారు చేస్తున్నారు. కొందరు బంగారంతో తయారు చేస్తే, మరికొందరు వెండితో మాస్క్ రూపొందిస్తున్నారు. మరికొందరు వివిధ బొమ్మల రూపాల్లో తయారు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తన ఆలోచనకు తగ్గట్లు ఎల్ఈడీ మాస్క్ ను తీర్చిదిద్దాడు.

పశ్చిమ బెంగాల్‌లోని కాంచపారాకు చెందిన గౌర్‌నాథ్‌ అనే వ్యక్తి ఎల్‌ఈడీ మాస్కును రూపొందించాడు. ఇందుకు సంబంధించిన విడియోను బంగ్లాదేశ్‌కు చెందిన బివాస్ దాస్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేసి దీన్ని ‘‘నైట్‌ మాస్క్‌’’గా అభివర్ణించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ మారింది.

తన ఆలోచనకు సృజనాత్మకతను జోడించి ఈ మాస్కును తయారు చేసినట్లు గౌర్‌నాథ్‌ అంటున్నాడు. రంగులు మారే చిన్న ఎల్ఈడీ లైట్లను మాస్కులో పొందుపర్చి తయారు చేసినట్లు ఆయన తెలిపాడు. ఈ మాస్క్ అన్ని సమయాల్లో ధరించేలా రూపొందించినట్లు అతను చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి. ఇలా విభిన్న ఆకృతుల్లో తయారు చేసే మాస్క్ ల పట్ల ప్రజల్లో అసక్తి కలిగి ధరిస్తారని గౌర్‌నాథ్‌ అశాభావం వ్యక్తం చేశారు.