వయసు పెరుగుతోంది, ఇకపై గ్రౌండ్‌లో క్రమశిక్షణతో వ్యవహరిస్తా: డేవిడ్ వార్నర్

|

Nov 23, 2020 | 2:37 PM

ఇకపై గ్రౌండ్‌లో ప్రశాంతంగా ఉంటానని,  క్రమశిక్షణతో మెలుగుతానని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్​ డేవిడ్​ వార్నర్ తెలిపాడు. రిటైర్మెంట్​కు రోజులు దగ్గరపడుతున్న కారణంగా....

వయసు పెరుగుతోంది, ఇకపై గ్రౌండ్‌లో క్రమశిక్షణతో వ్యవహరిస్తా: డేవిడ్ వార్నర్
Follow us on

ఇకపై గ్రౌండ్‌లో ప్రశాంతంగా ఉంటానని,  క్రమశిక్షణతో మెలుగుతానని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్​ డేవిడ్​ వార్నర్ తెలిపాడు. రిటైర్మెంట్​కు రోజులు దగ్గరపడుతున్న కారణంగా తనలోని దూకుడు స్వభావాన్ని క్రమంగా మార్చుకుంటున్నట్లు చెప్పాడు. ఎవరైనా తనపై స్లెడ్జింగ్‌కి పాల్పడితే.. వారికి బ్యాట్​తో మాత్రమే సమాధానం చెబుతానని పేర్కొన్నాడు. ఈ మధ్యే 34వ ఏట అడుగు పెట్టానని.. ఇకపై మైదానంలో గతంలోలా మాటల యుద్ధానికి దిగకుండా, మౌనంగా వెళ్లాలనుకుంటున్నట్లు వివరించాడు.

భారత్‌తో జరగబోయే వన్డే సిరీస్​ గురించి కూడా వార్నర్ మాట్లాడాడు. వన్డేల్లో మంచి ఓపెనింగ్​ చేయడం సహా మధ్య ఓవర్లలో దూకుడుగా ఆడటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను మంచి స్ట్రైక్​రేట్​తో బ్యాటింగ్​ చేస్తున్నానని… వయసు పెరుగుతున్న క్రమశిక్షణ   నేర్చుకోవడం వల్ల ఆటలో అత్యున్నత స్థాయికి చేరుతామని వెల్లడించాడు. వన్డే, టీ20ల్లో భారత వైస్​కెప్టెన్​ రోహిత్​ శర్మ అందుబాటులో లేకపోవడంపై డేవిడ్​ వార్నర్​ స్పందించాడు. జట్టులో సీనియర్ ప్లేయర్ రోహిత్​ లేకపోయినా.. మంచి ఫామ్​లో ఉన్న క్రికెటర్లు చాలామంది ఉన్నారని అభిప్రాయపడ్డాడు. శిఖర్​ ధావన్​, కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​లు ఐపీఎల్​లో అద్భుతంగా ఆడారని గుర్తు చేశాడు. టెస్టు వైస్​కెప్టెన్​ అంజిక్య రహానె ప్రశాంతంగా ఆడుతూ.. పని పూర్తి చేస్తాడని వెల్లడించాడు.