AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన “అస్సాం కీల్‌బ్యాక్” ..129 ఏళ్ల త‌ర్వాత క‌నిపించింది

కరోనా వైర‌స్..మ‌నుషులంద‌ర్నీ ఇంట్లోకి నెట్టిస్తోంది. బ‌య‌ట‌కు వ‌స్తే బెంబేలెత్తిస్తోంది. కానీ జంతువులు, పక్షులు మాత్రం హాయిగా రోడ్ల‌పై సంచ‌రిస్తున్నాయి. కాలుష్యం త‌గ్గిపోవ‌డంతో ప‌క్షులు స్వేచ్చ‌గా విహ‌రిస్తున్నాయి.

అరుదైన  “అస్సాం కీల్‌బ్యాక్” ..129 ఏళ్ల త‌ర్వాత క‌నిపించింది
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2020 | 11:31 PM

Share

కరోనా వైర‌స్..మ‌నుషులంద‌ర్నీ ఇంట్లోకి నెట్టిస్తోంది. బ‌య‌ట‌కు వ‌స్తే బెంబేలెత్తిస్తోంది. కానీ జంతువులు, పక్షులు మాత్రం హాయిగా రోడ్ల‌పై సంచ‌రిస్తున్నాయి. కాలుష్యం త‌గ్గిపోవ‌డంతో ప‌క్షులు స్వేచ్చ‌గా విహ‌రిస్తున్నాయి. చాలాకాలంగా క‌నిపించ‌ని ఫ్లెమింగోలు, క్లౌడ్ కోకిలలు, డాల్ఫిన్లు సైతం ఇటీవ‌ల ప‌రిస్థితుల వ‌ల్ల ఇండియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో అరుదైన‌ సరీసృపాలు కూడా చేరాయి. అంతరించిపోయినదిగా పరిగణిస్తోన్న‌ , “అస్సాం కీల్‌బ్యాక్” అని పిలువబడే పాము జాతి ఈశాన్య భారతదేశంలోని… అస్సాంలో 129 సంవత్సరాల తిరిగి ద‌ర్శ‌న‌మిచ్చింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులు ఈ విషం లేని పాము జాతిని తిరిగి కనుగొన్నట్లు క‌న్పామ్ చేశారు, వీటి ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

“అస్సాం కీల్‌బ్యాక్” అని సంబోధించే ‘హెబియస్ పీలి’ జాతికి చెందిన రెండు మగ పాములను 1891 లో మొద‌టిసారి బ్రిటిష్ టీ-ప్లాంటర్ శామ్యూల్ ఎడ్వర్డ్ పీల్ అసోంలోని సిబ్సాగర్ జిల్లా పరిధిలో కనుగొన్నారు. వాటిని సేక‌రించి ఒక‌దాన్ని కోల్‌కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, మరొకదాన్ని లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత ఈ రకం పాములను ఎవ్వ‌రికీ క‌నిపించ‌క‌పోవ‌డంతో అంత‌రించిపోయిన‌విగా ప‌రిగణించారు.

తాజాగా ఈ జాతి పామును, అసోం-అరుణాచల్ ప్రదేశ్ బార్డ‌ర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 2018 సెప్టెంబర్‌లో గుర్తించారు. అన్ని నిర్దార‌ణల‌ను చేసుకున్న అనంత‌రం.. జర్మనీ నుంచి ప్రచురితమవుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ పత్రిక వెర్టెబ్రేట్ జువాలజీలో ఈ పాము గురించిన వివ‌రాల‌ను ఇటీవ‌ల‌ ప్రచురించారు.