టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ.. ఏం చేసిందంటే?

| Edited By: Pardhasaradhi Peri

Oct 12, 2019 | 7:40 AM

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విద్యార్థి సంఘాల వరకు అందరి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు కూడా వారికి పూర్తి మద్దతుగా నిలవనున్నారు. వారు కోరిన న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ నేపథ్యంలో 13వ తారీఖు నుంచి ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 128 డిపోల్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని […]

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ.. ఏం చేసిందంటే?
Follow us on

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విద్యార్థి సంఘాల వరకు అందరి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు కూడా వారికి పూర్తి మద్దతుగా నిలవనున్నారు. వారు కోరిన న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ నేపథ్యంలో 13వ తారీఖు నుంచి ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 128 డిపోల్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ ఆర్టీసీ కూడా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా పలు న్యాయమైన డిమాండ్లు కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఏడు రోజులుగా సాగుతున్న ఈ సమ్మె తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పాటుగా అందరి మద్దతు కూడా లభించింది. అయితే, కార్మికులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, ప్రతిపక్షాలు ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది.