పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో కట్...

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

Updated on: Nov 18, 2020 | 3:50 PM

AP Government: ప్రభుత్వ ఉద్యోగ పింఛనుదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో కట్ చేసిన 50 శాతం పింఛన్‌ను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లించేందుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి సత్యనారాయణ అంగీకరించారని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అలాగే మొదటి విడత మొత్తాన్ని డిసెంబర్ 1వ తేదీన విడుదలయ్యే పింఛన్‌ను అందజేస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు గవర్నమెంట్ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2018 జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు అందులో పేర్కొంది. దీనితో వారికి కరువు భత్యం 27.248 నుంచి 30.392 కు పెరిగిన విషయం విదితమే.

Also Read:

‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..

Flash News: ఫిబ్రవరిలో ఏపీ పంచాయితీ ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన..?

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!

ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!

Loading...
Unable to load recommendations.
Follow Us