గుడ్ న్యూస్..ప్రభుత్వ నియామకాల్లో 42 ఏళ్ల అర్హత వయసు గడుపు పెంపు..
గవర్నమెంట్ నియామకాల్లో 42 ఏళ్ల అర్హతా వయసు గడువును ఏపీ సర్కార్ పొడిగించింది. వాస్తవానికి 2019 సెప్టెంబర్ 30తో ముగిసిన గడువును 2021 సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
గవర్నమెంట్ నియామకాల్లో 42 ఏళ్ల అర్హతా వయసు గడువును ఏపీ సర్కార్ పొడిగించింది. వాస్తవానికి 2019 సెప్టెంబర్ 30తో ముగిసిన గడువును 2021 సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర గవర్నమెంట్ ఏజెన్సీల నియామకాల్లో ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అధిక వయోపరిమితిని 42 కి పెంచడం ద్వారా ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంపొందించింది. అయితే, యూనిఫాం సర్వీసుల (పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలు) పోస్టులకు ప్రత్యక్ష నియామకానికి ఇది వర్తించదు.