అంగన్‌వాడీల్లో ‘నాడు–నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చేపట్టాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్షా

అంగన్‌వాడీల్లో ‘నాడు–నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 6:41 PM

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు – నేడు కార్యక్రమాలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చేపట్టాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు.

అన్ని అంగన్‌వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని, మంచి పౌష్టికాహారాన్ని తల్లులకు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. గర్భవతులకు, తల్లులకు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం, తాడేపల్లిలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు ఇతర అధికారులు హాజరు అయ్యారు.

కాగా.. అంగన్‌వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఫ్రిజ్, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, రంగులు, బ్లాక్‌ బోర్డులు, ప్రహరీగోడ సహా కావాల్సిన మరమ్మతులు చేసి, సదుపాయాలను కల్పించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఏపీలోని ప్రీ స్కూల్స్ లో అమలుపరుస్తున్న విధానంలోకి.. అంగన్‌వాడీ స్కూళ్లన్నీ కూడా రావాలని సీఎం పేర్కొన్నారు. నాడు – నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, అదే తరహాలో అంగన్‌వాడీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సదుపాయాలు కల్పించాలని సూచించారు.