AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధాని రైతులపై జగన్ సర్కార్ వరాల జల్లు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెడితే.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో వ్యవసాయశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చకు తీసుకొచ్చారు. ఇక ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు కమిటీలను(బోస్టన్, హైపవర్) వేసి అధ్యయనం చేశామని.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ […]

రాజధాని రైతులపై జగన్ సర్కార్ వరాల జల్లు!
Ravi Kiran
|

Updated on: Jan 20, 2020 | 3:08 PM

Share

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెడితే.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సభలో వ్యవసాయశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చకు తీసుకొచ్చారు. ఇక ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రెండు కమిటీలను(బోస్టన్, హైపవర్) వేసి అధ్యయనం చేశామని.. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టిందని ఆరోపించారు. హైపవర్ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చిందని దానికి అనుగుణంగా 13 జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం రాజధాని రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలను కొనసాగిస్తామన్నారు. 28 వేల మంది రైతులు సుమారు 34 వేల ఎకరాలను ఇచ్చారని అందరికీ కూడా మెరుగైన ప్యాకేజీ ఇచ్చేస్తామని అన్నారు. ఇకపోతే రైతులకు ఇచ్చే రూ.2500 పెన్షన్‌ను రూ.5వేలకు పెంచుతున్నామని తెలిపారు. అటు భూముల ఇచ్చిన రైతులకు 15 ఏళ్ళ వరకు కౌలు ఇస్తామని.. పట్టా భూములిచ్చిన రైతులకు 1000 గజాల నివాస స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.