కర్నాటకలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా.. ‘ స్వామి ‘ కి మరో దెబ్బ !

కర్ణాటకలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సుధాకర్, ఎంబీటీ. నాగరాజ్ రాజీనామా చేశారు. దీంతో పార్టీకి రాజీనామాలు చేసిన సభ్యుల సంఖ్య 16 కు పెరిగింది. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుధాకర్, నాగరాజ్ ఇద్దరూ బుధవారం సాయంత్రం స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మరోవైపు..మాజీ సీఎం, బీజేపీ నేత ఎడ్యూరప్ప..స్పీకర్ ను కలిసిన అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు […]

కర్నాటకలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా.. ' స్వామి  ' కి మరో దెబ్బ !
Follow us

|

Updated on: Jul 10, 2019 | 5:54 PM

కర్ణాటకలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సుధాకర్, ఎంబీటీ. నాగరాజ్ రాజీనామా చేశారు. దీంతో పార్టీకి రాజీనామాలు చేసిన సభ్యుల సంఖ్య 16 కు పెరిగింది. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుధాకర్, నాగరాజ్ ఇద్దరూ బుధవారం సాయంత్రం స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మరోవైపు..మాజీ సీఎం, బీజేపీ నేత ఎడ్యూరప్ప..స్పీకర్ ను కలిసిన అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశమివ్వాలని, అసెంబ్లీలో బలనిరూపణకు అనుమతించాలని అభ్యర్థించారు. సభలో మేం మెజారిటీ నిరూపించుకుంటాం.. మాకా సత్తా ఉంది అని ఆయన ఆ తరువాత వ్యాఖ్యానించారు. అటు-ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కమలం పార్టీకి మద్దతు ఇఛ్చిన పక్షంలో శాసన సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 107 కు పెరుగుతుంది.ఇది కమలం పార్టీకి లాభదాయకమే. మరోవైపు… ముంబైలో రెబల్ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడకపోవడంతోను, ఇటు బెంగుళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ‘ డబుల్ స్టాండర్డ్స్ ‘ పాటించడంతోను ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. అవకాశం వస్తే సిఎం కుర్చీ ఎక్కేందుకు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ‘ ఛాన్స్ ‘ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా- తమ పార్టీకి చెందిన జేడీ-ఎస్ ఎమ్మెల్యేలను బెంగుళూరు శివారు లోని రిసార్ట్ కు కుమారస్వామి తరలించినప్పటికీ.. ప్రభుత్వ పరిస్థితి ‘ ముందు నుయ్యి-వెనుక గొయ్యి- అన్న చందంగా ఉంది. ఇదే తరుణమని బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తనవంతు తాను తెర చాటు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి కర్ణాటకలో రాజకీయ ‘ నాటకం ‘ ఓ పెద్ద సీరియల్ లా సాగుతోంది.

Latest Articles
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు