ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తులు సీజ్..రూ.కోటి 99 లక్షల డీడీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.కోటి 99 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణతో పాటు తమిళనాడులోని చిట్ఫండ్ కంపెనీల్లో దేవికారాణి, కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.కోటి 99 లక్షల డీడీని చిట్ఫండ్...
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.కోటి 99 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణతో పాటు తమిళనాడులోని చిట్ఫండ్ కంపెనీల్లో దేవికారాణి, కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.కోటి 99 లక్షల డీడీని చిట్ఫండ్ కంపెనీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతోపాటుగా ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను స్వాధీనం చేసుకున్నారు. రూ. 4 కోట్ల 47 లక్షలతో పాటు.. రూ. 2 కోట్ల 29 లక్షల డీడీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో దేవికారాణిని సెప్టెంబర్ 4న మరోసారి అరెస్ట్ అయ్యారు. దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇదే నెల 21న ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ స్కామ్లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్లపై ఏసీబీ కేసు నమోదు చేసింది.