AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధ్యాహ్న భోజనంలో జగన్ మార్క్ మార్పులు..!!

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలో సీఎం జగన్ సమీక్షించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై వారితో చర్చించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని […]

మధ్యాహ్న భోజనంలో జగన్ మార్క్ మార్పులు..!!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 03, 2019 | 7:14 PM

Share

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలో సీఎం జగన్ సమీక్షించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై వారితో చర్చించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్నారు. ఇక మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ పెంచడం పై దృష్టి పెట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వడం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇక స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో సుమారు 15 వేలకు పైగా స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి సురేష్ జగన్‌కు తెలిపారు. ఇక సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ ప్రభుత్వ స్కూళ్లు తీసిపోకుండా ఉండాలని జగన్ నిర్ణయించారు. పది రూపాయలు ఎక్కువైనా సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దని సూచించారు. అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం నిర్ణయించారు

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే