మధ్యాహ్న భోజనంలో జగన్ మార్క్ మార్పులు..!!

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలో సీఎం జగన్ సమీక్షించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై వారితో చర్చించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని […]

మధ్యాహ్న భోజనంలో జగన్ మార్క్ మార్పులు..!!
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 7:14 PM

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితలో సీఎం జగన్ సమీక్షించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పై వారితో చర్చించారు. ప్రస్తుతం వారికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యవంతమైన తల్లులు, పిల్లలు ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్నారు. ఇక మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ పెంచడం పై దృష్టి పెట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వడం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇక స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నవంబర్‌ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో సుమారు 15 వేలకు పైగా స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి సురేష్ జగన్‌కు తెలిపారు. ఇక సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ ప్రభుత్వ స్కూళ్లు తీసిపోకుండా ఉండాలని జగన్ నిర్ణయించారు. పది రూపాయలు ఎక్కువైనా సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దని సూచించారు. అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం నిర్ణయించారు

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు