ఆంధ్రప్రదేశ్ను మెచ్చిన స్వచ్ఛ భారత్.. జాతీయ స్థాయిలో మరో సారి అవార్డుల పంట
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు మరోసారి అవార్డుల పంటపండింది. ఈ అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు...
AP Won The Awards : జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు మరోసారి అవార్డుల పంటపండింది. ఈ అవార్డులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి.
ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని తెలిపారు.
Heartiest congratulations to all districts for their phenomenal contribution towards the #SwachhBharatMission. Here’s a list of the awardees. West & East Godavari – Andhra Pradesh Kanker & Bemetara -Chhattisgarh Vadodara & Rajkot – Gujarat Rewari & Bhiwani – Haryana#Toilet4All pic.twitter.com/Lzvrc6NDPc
— Swachh Bharat I #IndiaFightsCorona (@swachhbharat) November 19, 2020