ఏపీలో ‘నాగ సొరకాయల’ పేరిట లక్షల్లో మోసం.. 21 మంది అరెస్ట్
దేవుడిపై భక్తుల నమ్మకాన్ని, వారి భక్తిని క్యాష్ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతుంటారు
Naga Sorakaya scam: మనుషుల నమ్మకాన్ని, వారి ఆర్థిక పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతుంటారు. విచిత్రమైన విషయాలను భక్తులకు చెబుతూ వారిని నమ్మిస్తూ మోసం చేస్తుంటారు. ఇలా ఏపీలో మాయ సొరకాయల పేరిట లక్షల్లో భక్తులను మోసం చేశారు. ఈ విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో.. రంగంలోకి దిగిన వారు 21 మందిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ శ్రీశైలం దేవాలయంలో ఇటీవల ఓ ముఠా హల్చల్ చేసింది. అక్కడ ఒక ప్రత్యేక ఆకారంలో ఉన్న సొరకాయలను అమ్ముతున్న ఆ ముఠా.. ఈ సొరకాయలు మామూలువి కాదని, వాటిలో చాలా శక్తులు ఉన్నాయని చెప్పింది. నల్లమల్ల అడవుల్లో మాత్రమే ఇవి పండుతాయని, ఈ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లడం ద్వారా వారి సంపద పెరుగుతుందని నమ్మించింది. ఇక వారి మాటలను నమ్మిన కొందరు లక్షలు చెల్లించి ఆ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లారు. ఇంకొందరైతే కోటి నుంచి రూ.2కోట్లు కూడా చెల్లించినట్లు ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి 21 మందిని అరెస్ట్ చేసినట్లు నాగేంద్ర తెలిపారు. అందులో తెలంగాణ వారు కూడా ఉన్నారని, శ్రీశైలంలో ఉన్న అన్నపూర్ణ దేవి ఆశ్రమంతో వీరికి లింక్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమం నడుపుతున్న వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరందరిపై 420 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు నాగేంద్ర వివరించారు. కాగా ఈ సొరకాయలు పాముల ముందు ఊదే నాగస్వరం ఆకారంలో ఉంటాయి. వీటిని నాగ సొరకాయలు అని పిలుస్తుంటారు. ఇటీవల ఈ సొరకాయలు మ్యాటర్ బాగా హల్చల్ చేయగా.. వారి మాయలో పడకండి అని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అవగాహన కలిగించిన విషయం తెలిసిందే.
Read More:
15 ఏళ్ల తరువాత దిల్ రాజు ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడా..!