AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ‘నాగ సొరకాయల’ పేరిట లక్షల్లో మోసం.. 21 మంది అరెస్ట్‌

దేవుడిపై భక్తుల నమ్మకాన్ని, వారి భక్తిని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతుంటారు

ఏపీలో 'నాగ సొరకాయల' పేరిట లక్షల్లో మోసం.. 21 మంది అరెస్ట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 5:04 PM

Share

Naga Sorakaya scam: మనుషుల నమ్మకాన్ని, వారి ఆర్థిక పరిస్థితిని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతుంటారు. విచిత్రమైన విషయాలను భక్తులకు చెబుతూ వారిని నమ్మిస్తూ మోసం చేస్తుంటారు. ఇలా ఏపీలో మాయ సొరకాయల పేరిట లక్షల్లో భక్తులను మోసం చేశారు. ఈ విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో.. రంగంలోకి దిగిన వారు 21 మందిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ శ్రీశైలం దేవాలయంలో ఇటీవల ఓ ముఠా హల్‌చల్‌ చేసింది. అక్కడ ఒక ప్రత్యేక ఆకారంలో ఉన్న సొరకాయలను అమ్ముతున్న ఆ ముఠా.. ఈ సొరకాయలు మామూలువి కాదని, వాటిలో చాలా శక్తులు ఉన్నాయని చెప్పింది. నల్లమల్ల అడవుల్లో మాత్రమే ఇవి పండుతాయని, ఈ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లడం ద్వారా వారి సంపద పెరుగుతుందని నమ్మించింది. ఇక వారి మాటలను నమ్మిన కొందరు లక్షలు చెల్లించి ఆ సొరకాయలను ఇంటికి తీసుకెళ్లారు. ఇంకొందరైతే కోటి నుంచి రూ.2కోట్లు కూడా చెల్లించినట్లు ఆత్మకూరు ఎస్సై నాగేంద్ర వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి 21 మందిని అరెస్ట్ చేసినట్లు నాగేంద్ర తెలిపారు. అందులో తెలంగాణ వారు కూడా ఉన్నారని, శ్రీశైలంలో ఉన్న అన్నపూర్ణ దేవి ఆశ్రమంతో వీరికి లింక్‌లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమం నడుపుతున్న వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరందరిపై 420 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు నాగేంద్ర వివరించారు. కాగా ఈ సొరకాయలు పాముల ముందు ఊదే నాగస్వరం ఆకారంలో ఉంటాయి. వీటిని నాగ సొరకాయలు అని పిలుస్తుంటారు. ఇటీవల ఈ సొరకాయలు మ్యాటర్‌ బాగా హల్‌చల్‌ చేయగా.. వారి మాయలో పడకండి అని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అవగాహన కలిగించిన విషయం తెలిసిందే.

Read More:

15 ఏళ్ల తరువాత దిల్‌ రాజు ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడా..!

మెగాస్టార్ చెల్లెలిగా సాయి పల్లవి ఫిక్స్‌..!