AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ?

రెండో సారి ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్న మోదీ మెల్లగా తన రాజకీయ చాతుర్యాన్ని చూపడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తనకు కుడి భుజంగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా బీజేపీని విజయపథాన నడిపించిన అమిత్ షాను తన కొత్త మంత్రివర్గంలో చేర్చుకునే సూచనలు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి గురువారం ఉదయమే వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షాను కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ సూచించినప్పటికీ మోదీ […]

అమిత్ షా ఇక కేంద్ర మంత్రి ?
Pardhasaradhi Peri
|

Updated on: May 30, 2019 | 5:05 PM

Share

రెండో సారి ప్రధానిగా ఢిల్లీ పీఠం ఎక్కబోతున్న మోదీ మెల్లగా తన రాజకీయ చాతుర్యాన్ని చూపడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తనకు కుడి భుజంగా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా బీజేపీని విజయపథాన నడిపించిన అమిత్ షాను తన కొత్త మంత్రివర్గంలో చేర్చుకునే సూచనలు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి గురువారం ఉదయమే వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షాను కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ సూచించినప్పటికీ మోదీ ఆ సూచనను పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో కూడా అమిత్ షా తనకు చేదోడువాదోడుగా ఉంటారని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలని మోదీ ఓ నిర్ణయానికి వఛ్చినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే అమిత్ షా ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉండవచ్చు. అటు.అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీకి అత్యంత ప్రాధాన్యం గల బెర్తు దక్కవచ్ఛునని తెలుస్తోంది.కాగా-బాబుల్ సుప్రియో, రాజ్ నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్ వంటి పాత వారితో బాటు కిషన్ రెడ్డి లాంటి కొత్తవారిని కూడా మోదీ తన కేబినెట్లోకి తీసుకోవడం విశేషం.