AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముస్లింల విషయంలో చైనాపై అగ్రదేశాల ఆగ్రహం

అసలే కరోనా విషయంలో యూరోపియన్ అగ్రరాజ్యాలు డ్రాగన్ కంట్రీపై గుర్రుగా ఉంటే తాజాగా ముస్లింల అంశం ఆయా దేశాల్ని చికాకుపెడుతోంది. ఉగ్రవాద నిర్మూలన పేరిట మైనార్టీ వర్గాల..

ముస్లింల విషయంలో చైనాపై అగ్రదేశాల ఆగ్రహం
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 8:27 PM

Share

అసలే కరోనా విషయంలో యూరోపియన్ అగ్రరాజ్యాలు డ్రాగన్ కంట్రీపై గుర్రుగా ఉంటే తాజాగా ముస్లింల అంశం ఆయా దేశాల్ని చికాకుపెడుతోంది. ఉగ్రవాద నిర్మూలన పేరిట మైనార్టీ వర్గాల హక్కులను చైనా కాలరాస్తోందని అమెరికా, యూకే, జర్మనీ తీవ్రంగా మండిపడ్డాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా ఆయా దేశాల ప్రతినిధులు చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. జింగ్‌జియాంగ్‌లో నివసిస్తున్న పది లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించడం పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అటు, యూకే, జర్మనీ ప్రతినిధులు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాయువ్య చైనాలో గల జిన్‌జియాంగ్‌ ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించిన డ్రాగన్‌.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన అంశం అంతర్జాతీయ మీడియాలో భగ్గుమన్న సంగతి తెలిసిందే.