AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మూడు చిత్రాలను ఎన్ని సార్లు చూశానో…

టాలీవుడ్‌లోనే కాదు... సౌత్‌లోనే ఇప్పుడు టాప్‌ రేంజ్‌లో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌ను కూడా టచ్ చేసే పనిలో పడ్డారు. సౌత్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ చాలా స్పెషల్.

ఆ మూడు చిత్రాలను ఎన్ని సార్లు చూశానో...
Pardhasaradhi Peri
|

Updated on: May 25, 2020 | 1:19 PM

Share

టాలీవుడ్‌లోనే కాదు… సౌత్‌లోనే ఇప్పుడు టాప్‌ రేంజ్‌లో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌ను కూడా టచ్ చేసే పనిలో పడ్డారు. సౌత్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ చాలా స్పెషల్. ‘అల.. వైకుంఠపురములో..’ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మరీ పెరిగిపోయింది. ఈయన ఆ సినిమాతో సృష్టిస్తున్న రికార్డులకు ఇంకా బ్రేక్ లేకుండా పోతుంది. ఇప్పటికీ ఆ రికార్డులను తిరగరాస్తూనే ఉన్నాడు బన్నీ. దానికితోడు మలయాళంలో కూడా సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

ఇక తాజాగా వస్తున్న పుష్ప సినిమాని సుకుమార్ పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లడంతో… ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు బన్నీ. పుష్ప సినిమాను మొదలెట్టినప్పటి నుండి బాలీవుడ్ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నాడు.

బాలీవుడ్ మూవీస్‌లో ఆ మూడు సినిమాలంటే తనకి చాలా ఉష్టమంటూ ఓ మీడియాతో అన్నారు. అంతే కాకుండా ఓ బాలీవుడ్ చిత్రాన్ని 20 సార్లు చూశానంటూ రివిల్ చేశాడు. ఆ సినిమాలంటే తనకి ఎంతో ఇష్టమని.. ఓ మూడింటిని ఎక్కువ సార్లు చూశానని వెల్లడించారు. అందులో తనకు ఎంతో ఇష్టమైన ‘జో జీతా వహీ సికందర్‌’ చిత్రాన్ని 20 కంటే ఎక్కువ సార్లు చూశానని చెప్పారు. అయితే తనకు వ్యక్తిగతంగా ఓ మధురానుభూతిని ఇచ్చే సినిమా మాత్రం బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ అని అన్నారు. అదే తరహాలో ఇటీవల కాలంలో విడుదలైన ‘గల్లీబాయ్‌’ని 3-4 సార్లు చూసినట్లుగా చెప్పారు.