AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్.. పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

కరోనా వైరస్‌ను నివారించడానికి దేశంలో వ్యాక్సినేషన్ కు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదట ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌...

గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్.. పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
Sanjay Kasula
|

Updated on: Jan 11, 2021 | 6:28 AM

Share

కరోనా వైరస్‌ను నివారించడానికి దేశంలో వ్యాక్సినేషన్ కు ముహూర్తం ఖరారైంది. ఈనెల 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదట ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీలో వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు రాష్ట్రస్థాయి కోల్డ్ స్టోరేజ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా గన్నవరంలోనూ, కర్నూలు, కడప, గుంటూరు విశాఖపట్నంలలో నాలుగు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని 18 జిల్లాలలో మొత్తం 1,659 కోల్డ్ స్టోరేజ్ చెయిన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ రవాణా కోసం ప్రస్తుతం 2 నుండి 8 డిగ్రీల ఉష్ణోగ్రతతో 19 రిఫ్రిజరేటెడ్ వ్యాక్సిన్ వ్యాన్లను సిద్ధంగా ఉంచారు. వ్యాక్సినేషన్ కోసం ఎఎన్ఎంలు 17,012 మంది, మొత్తం వ్యాక్సిన్ సెంటర్లు 7,469 సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం 6 వాకిన్ కూలర్స్ , 2 వ్యాక్సిన్ ఫ్రీజర్స్ , 65 భారీ డీప్ ఫ్రీజర్‌లు పంపించింది.

అయితే వీటితో పాటు 7,108 కోల్డ్ బాక్సులు, లక్షా 50 వేల 700 జన్ ప్యాక్ లు పంపాల్సిందిగా కేంద్రాన్ని ఏపీ అధికారులు కోరారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ నెల వరకూ ఎనిమిది నెలల పాటు నిర్వహించే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన వ్యాక్సిన్ డోస్ లు, వాటి నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంచనాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపారు.

ఏపీలో వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించేందుకు ఆరోగ్య వైద్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి 15 రోజులకోసారి భేటీ కానుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి సోమవారం సమావేశం కానున్నారు.

నగర పాలక సంఘస్థాయిలో మున్సిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసిల్దార్ నేతృత్వంలో ఏర్పడిన టాస్క్ ఫోర్స్ కమిటీలు ప్రతి మంగళవారం భేటీ అయి కార్యక్రమ పురోగతిని సమీక్షించనున్నాయి. వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ కమిటీలన్నీ సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తాయి. త్వరలో ప్రారంభం కానున్న తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 3 లక్షల 70 వేల మంది హెల్త్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు.

అయితే ఆదివారం గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్‌ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?