హీరా గ్రూప్స్ కేసులో దర్యాప్తు వేగవంతం.. దేశవ్యాప్తంగా కేసులన్ని హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ

సామాన్య ప్రజల నుంచి స్కీముల పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించిన హీరా గ్రూప్స్ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వందల కోట్ల రూపాయల స్కాములకు పాల్పడ్డ హీరా గ్రూప్స్‌ అధినేత్రి నౌహీరా షేక్‌పై ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు తెలంగాణకు బదిలీ అవుతున్నాయి.

హీరా గ్రూప్స్ కేసులో దర్యాప్తు వేగవంతం.. దేశవ్యాప్తంగా కేసులన్ని హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ
Follow us

|

Updated on: Dec 19, 2020 | 2:26 PM

సామాన్య ప్రజల నుంచి స్కీముల పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించిన హీరా గ్రూప్స్ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వందల కోట్ల రూపాయల స్కాములకు పాల్పడ్డ హీరా గ్రూప్స్‌ అధినేత్రి నౌహీరా షేక్‌పై ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు తెలంగాణకు బదిలీ అవుతున్నాయి. ఢిల్లీలో నమోదైన ఓ కేసును పోలీసులు హైదరాబాద్‌ సీసీఎ్‌సకు బదిలీ చేశారు. ఎక్కువ వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించింది హీరా గ్రూప్స్. నిధులను తన వ్యక్తిగత ఖాతాల్లోకి దారిమళ్లించిన ఆరోపణలపై నౌహీరాను సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశీయుల నుంచి హీరా గ్రూప్స్‌ దేశవ్యాప్తంగా 1,72,114 మంది డిపాజిటర్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు వసూలు చేసినట్లు సీసీఎస్‌ విచారణలో వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు సేకరించడం, నిధుల దారిమళ్లింపునకు సంబంధించి మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నౌహీరా షేక్‌తోపాటు సంస్థ ప్రతినిధులు బీజూ థామస్‌, మోలీ థామ్‌సను గతంలో విచారించింది.

ఈ స్కాములకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళతోపాటు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు, సౌదీ అరేబియా, పశ్చిమాసియా దేశాల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు సీసీఎస్ ఆధారాలు సేకరించింది. ఇప్పటికీ ఇంకా బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. దీంతో అయా పోలీసులు కేసుల్ని హైదరాబాద్ సీసీఎస్ కు బదిలీ చేస్తున్నారు.