బోయిన్‌‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. రెండో రోజు అఖిలప్రియను విచారిస్తున్న పోలీసులు

|

Jan 12, 2021 | 10:10 AM

అఖిలప్రియ చంచల్‌గూడ మహిళ జైలు నుండి బేగంపేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఈ కేసులో అఖిలప్రియ ప్రమేయంపై రెండో రోజు విచారిస్తున్నారు.

బోయిన్‌‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. రెండో రోజు అఖిలప్రియను విచారిస్తున్న పోలీసులు
Follow us on

Akhilapriya in Police custody : బోయిన్‌‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అఖిలప్రియను బేగంపేట మహిళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు చంచల్‌గూడ మహిళ జైలు నుండి బేగంపేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఈ కేసులో అఖిలప్రియ ప్రమేయంపై రెండో రోజు విచారిస్తున్నారు. సేకరించిన ఆధారాలను ముందు ఉంచి అఖిల ప్రియను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. కిడ్నాప్ కోసం ఉపయోగించిన సిమ్ కార్డ్స్, ఫోన్ కాల్స్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నా‌ప్‌లో పాల్గొన్న నిందితుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అఖిల ప్రియ విచారణను మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. రేపటితో అఖిలప్రియ కస్టడీ విచారణ ముగియనుంది.

అలాగే. పోలీస్ డిపార్ట్మెంట్ పై అఖిల ప్రియ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ సీపీ స్పందించడంటూ అఖిల ప్రియకు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అఖిల ప్రియ జోక్యం ఎంత వరకు ఉందన్న విషయాలు అఖిల ప్రియ దృష్టికి తీసుకువెళ్లారు. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఇవాళ్టి విచారణ కీలకంగా మారనుంది. ఈ కేసు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుంటూరు శ్రీను పాత్ర ఎంత వరకు ఉన్నదని దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.