AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా భేటీ

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా భేటీ
Balaraju Goud
|

Updated on: Aug 26, 2020 | 11:20 AM

Share

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. అటు ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ వసూళ్లు, కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ అంశాలపై సోనియా గాంధీ సుదీర్ఘంగా చర్చించనున్నారు.

బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… మమతా ఈ సమావేశంలో పాల్గొనడం గమనించాల్సిన అంశం. కరోనా కాలంలో ఈ పరీక్షలను నిర్వహించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ పరీక్షలను వాయిదా వేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో పాటు, రాహుల్ గాంధీ, నవీన్ పట్నాయక్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ సమావేశం వర్చవల్ విధానంలో జరుగనుంది.