తీవ్రవాద నిషేధం అమలుపై ఐక్యరాజ్యసమితిని కోరిన భారత్
ఐక్యరాజ్యసమితిలో CCIT అమలుకు భారతదేశం కోరింది. దీంతో తీవ్రవాద గ్రూపులను నిషేధించి, సరిహద్దు తీవ్రవాదాన్ని అధీకృత నేరంగా చేయడానికి వీలవుతుంది. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రపంచ తీవ్రవాదిగా పేర్కొంది. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద ముఠా అధిపతి మసూద్ అజార్ చుట్టూ అంతర్జాతీయ ఉచ్చు బిగుసుకుంటోందని పాకిస్థాన్కు చెందిన అగ్రశ్రేణి దినపత్రికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ముష్కర ముఠాను శాశ్వతంగా మూసేయాలని అధికారులను కోరాయి. ‘‘దక్షిణాసియాలో అత్యంత ప్రమాదకరమైన […]
ఐక్యరాజ్యసమితిలో CCIT అమలుకు భారతదేశం కోరింది. దీంతో తీవ్రవాద గ్రూపులను నిషేధించి, సరిహద్దు తీవ్రవాదాన్ని అధీకృత నేరంగా చేయడానికి వీలవుతుంది. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రపంచ తీవ్రవాదిగా పేర్కొంది.
జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద ముఠా అధిపతి మసూద్ అజార్ చుట్టూ అంతర్జాతీయ ఉచ్చు బిగుసుకుంటోందని పాకిస్థాన్కు చెందిన అగ్రశ్రేణి దినపత్రికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ముష్కర ముఠాను శాశ్వతంగా మూసేయాలని అధికారులను కోరాయి. ‘‘దక్షిణాసియాలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద ముఠాల్లో ఒకటైన జైష్ ఎ మహ్మద్ చుట్టూ రెండు దశాబ్దాల తర్వాత ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనపడుతోంది. ఇది భారత విజయంగా కొందరు పేర్కొనవచ్చు. అయితే అజర్, అతడి ముఠా వల్ల పాక్కు కూడా ఇబ్బందులు కలిగాయి’’ అని డాన్ పత్రిక సంపాదకీయం పేర్కొంది. ఐరాస తాజా ఆంక్షలతో ఆ ముఠాను, దాని నాయకుడిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పుల్వామా ఉగ్ర దాడి, పాకిస్థాన్ సంస్థల ప్రస్తావన, కశ్మీర్ ఉద్యమంతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టడం వంటి అంశాలను తీర్మానం నుంచి తొలగించాకే మసూద్ విషయంలో చైనా తన అభ్యంతరాలను వెనక్కి తీసుకుందని ‘ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ అనే మరో పత్రిక పేర్కొంది.