AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP New CS :ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్..ఇకపై సీఎం ముఖ్యసలహాదారుగా నీలం సాహ్ని

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు.  సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు.

AP New CS :ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్..ఇకపై సీఎం ముఖ్యసలహాదారుగా నీలం సాహ్ని
Ram Naramaneni
|

Updated on: Dec 31, 2020 | 7:28 PM

Share

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు.  సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ నియామకానికి సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలసిందే. కొత్త బాధ్యతలు స్వీకరించిన క్రమంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ మీడియాతో మాట్లాడారు. సీఎస్‌గా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని..సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రభుత్వ అజెండానే తమ అజెండా అని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని..అది నెరవేరేలా శాయశక్తులు పెడతామన్నారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.  ప్రతి సమస్యకు పరిష్కారం కనుగునేందుకే అధికారులమంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇక ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం నేటి ముగియనుంది. దీంతో ఆమెను సీఎం ముఖ్యసలహాదారుగా గవర్నమెంట్ నియమించింది.

Also Read :

Love for dogs: కొడుకుపై కోపం..పెంపుడు శునకానికి రెండెక‌రాల భూమి రాసిన తండ్రి..చివర్లో ట్విస్ట్ ఏంటంటే..?

Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

 Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..