త్రిష మూడేళ్ల సినిమాకి ఓటీటీనే దిక్కైంది
37ఏళ్ల వయసులోనూ వెండితెరను ఏలుతోంది త్రిష. ఆమె మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి చేసిన సినిమాకి ఇప్పుడు మోక్షం వచ్చినట్టు కనిపిస్తోంది. రిలీజ్ కోసం..
37ఏళ్ల వయసులోనూ వెండితెరను ఏలుతోంది త్రిష. ఆమె మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి చేసిన సినిమాకి ఇప్పుడు మోక్షం వచ్చినట్టు కనిపిస్తోంది. రిలీజ్ కోసం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ‘శతురంగ వెట్టయ్ -2’ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యేందుకు మార్గం సుగమం అయింది. తాజాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకుంది. దీంతో అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా ఈ సినిమా రిలీజ్ కాబోతోందన్న మాట.