AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోరాపుట్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల హతం

కోరాపుట్‌ జిల్లా పాదువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, భద్రతాసిబ్బంది మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సరిహద్దులో కూంబింగ్ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా భద్రతాసిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది ఐదుగురిని హతమార్చారు. ఘటనాస్థలంలో కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలోనూ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అరాన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, […]

కోరాపుట్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల హతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2019 | 6:40 PM

Share

కోరాపుట్‌ జిల్లా పాదువా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, భద్రతాసిబ్బంది మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. సరిహద్దులో కూంబింగ్ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా భద్రతాసిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది ఐదుగురిని హతమార్చారు. ఘటనాస్థలంలో కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది.

ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలోనూ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అరాన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ హతమయ్యారు.