ఐదుగురు ఐటీబీపీ జవాన్లకు కరోనా పాజిటివ్.. 90 మంది క్వారంటైన్..
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కరోనా కలకలం రేగింది. బెటాలియన్కు చెందిన మరో ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణ
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కరోనా కలకలం రేగింది. బెటాలియన్కు చెందిన మరో ఇద్దరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. వీరిలో ముగ్గురు ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో అత్యవసర సేవల్లో పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా ఇద్దరిలో ఒకరు 50వ బెటాలియన్కు చెందిన ఎస్సై కాగా, మరొకరు హెడ్కానిస్టేబుల్.
మరోవైపు.. ఐటీబీపీలో ఐదుగురికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే 90 మందిని అధికారులు క్వారంటైన్కు పంపారు. ఎస్సై, హెడ్కానిస్టేబుల్ను హర్యానాలోని ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని 12 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్గా గుర్తించారు. దీంతో కరోనా బారినపడిన జవాన్ల సంఖ్య 65కు పెరిగింది. కాగా, మొత్తం 285 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, వైరస్ సోకిన అందరూ 31వ బెటాలియన్కు చెందినవారే కావడం గమనార్హం.