ఉగ్రకుట్ర భగ్నం.. హతమైన ఉగ్రవాదుల జేబులో ఎయిర్ బేస్ మ్యాప్స్
జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేశారు. కాశ్మీర్లోని శ్రీనగర్, అవంతిపుర ఎయిర్బేస్లపై దాడికి కుట్ర చేసిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. పంజ్గ్రామ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పంజ్గ్రామ్ లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి సైన్యం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. అవంతిపుర ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. అదే ప్రాంతం నక్కిన మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాల దగ్గర భారీ ఎత్తున […]
జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేశారు. కాశ్మీర్లోని శ్రీనగర్, అవంతిపుర ఎయిర్బేస్లపై దాడికి కుట్ర చేసిన ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. పంజ్గ్రామ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పంజ్గ్రామ్ లో నక్కిన ఉగ్రవాదులను కడతేర్చడానికి సైన్యం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. అవంతిపుర ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. అదే ప్రాంతం నక్కిన మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల మృతదేహాల దగ్గర భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు ఎయిర్బేస్ల మ్యాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
అర్ధరాత్రి నుంచి ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. సీఆర్ఫీఎఫ్ బలగాలతో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు, ఎస్ఓజీ బలగాలు కూడా కూంబింగ్లో పాల్గొన్నాయి. హిజ్బుల్ కమాండర్ షౌకత్ అహ్మద్ ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పుల్వామాలో గత గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్ట్తో పాటు పౌరుడు కూడా చనిపోయాడు.