AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంక ఉగ్రదాడిలో ఇద్దరు జేడీఎస్ నేతలు మృతి

శ్రీలంకలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటక జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కంచనహళ్లి లక్ష్మీనారాయణ, గోవెనహళ్లి శివన్న, అడకిమరనహళ్లి మారెగౌడ, హనుమంతరాయప్ప, హెచ్.పుట్టరాజు సహా మరొక నేత ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లగా.. పేలుళ్ల ఘటన తర్వాత కుటుంబసభ్యులకు వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. వారిలో ఇద్దరు మరణించినట్లు భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి […]

శ్రీలంక ఉగ్రదాడిలో ఇద్దరు జేడీఎస్ నేతలు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 12:37 PM

Share

శ్రీలంకలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటక జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కంచనహళ్లి లక్ష్మీనారాయణ, గోవెనహళ్లి శివన్న, అడకిమరనహళ్లి మారెగౌడ, హనుమంతరాయప్ప, హెచ్.పుట్టరాజు సహా మరొక నేత ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లగా.. పేలుళ్ల ఘటన తర్వాత కుటుంబసభ్యులకు వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. వారిలో ఇద్దరు మరణించినట్లు భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.

మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. ‘‘శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో జేడీఎస్‌కు చెందిన ఇద్దరు నేతలు మృతిచెందారని విని షాక్‌కు గురయ్యా. గల్లంతైన ఐదుగురి కోసం ఇండియన్ హై కమిషన్‌తో మాట్లాడుతున్నాం’’ అని అన్నారు.