ఐక్యారాజ్యసమితిలో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న స్వీడన్ బాలిక(16) గెట్రా. చిన్నతనం నుంచే పర్యావరణంపై పరిశోధనలు చేస్తూ, కాలుష్య రహిత పర్యావరణ ఉద్యమకారిణిగా పేరు సంపాదించుకుంది ఈమె. అందులో భాగంగానే గెట్రాకు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశమొచ్చింది. గెట్రా స్వీడన్ దేశానికి చెందిన అమ్మాయి.
అయితే.. ప్రస్తుతం ఆమె చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచనేతలకు గెట్రా ఓ వీడియో సందేశాన్ని పంపింది. ఇందులో భాగంగానే భారతదేశ ప్రధాని మోడీ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘ప్రియమైన మోడీ.. పర్యవరణ పరిరక్షణపై మీరు మాటలకే పరిమితం కావడం ద్వారా భవిష్యత్తులో మీరు విన్ గా కనిపించొద్దు. మాటలతో సరిపెడుతూ ఉంటే మీరు విఫలమవుతారు’ అంటూ వీడియోలో పేర్కొంది గెట్రా.