AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: ధోనికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అభిమాని.. ఫోటోస్ వైరల్!

మహేంద్రసింగ్ ధోని… ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. భారత్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన ఈ మిస్టర్ కూల్..

ఐపీఎల్ 2020: ధోనికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అభిమాని.. ఫోటోస్ వైరల్!
Ravi Kiran
|

Updated on: Oct 13, 2020 | 4:58 PM

Share

IPL 2020: మహేంద్రసింగ్ ధోని… ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు పూనకంతో ఊగిపోతారు. భారత్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన ఈ మిస్టర్ కూల్.. దేశానికి ఎంతో పేరు తెచ్చిపెట్టాడు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది డై హార్డ్ ఫ్యాన్స్ ధోని సొంతం. సరిగ్గా అలాంటి ఓ అభిమాని ధోనిపై ఉన్న అభిమానంతో ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.

చెన్నైలోని కడలూరు జిల్లా ఆరంగుర్‌కు చెందిన గోవిందన్ ధోనికి వీరాభిమాని. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు చిరు కానుక ఇచ్చే ఉద్దేశ్యంతో గోవిందన్.. తన ఇంటిని పూర్తిగా పసుపు రంగుకి మార్చేసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనిని ప్రతిబింబించేలా పెయింటింగ్స్, ఇంటి ముందు చెపాక్ స్టేడియం, ‘హోమ్ ఆఫ్ ధోని ఫ్యాన్’ పేరుతో తన ఇంటిని తయారు చేసుకున్నాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.