Illicit Relations: 22 ఏళ్లుగా అత్తతో అక్రమ సంబంధం.. బెడ్ రూమ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

|

May 24, 2023 | 9:28 AM

అక్రమ సంబంధాలు.. కుటుంబాలను కూల్చివేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల ప్రాణాలను సైతం బలిగొంటున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా.. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారిన దాఖలాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల సంసారంలో మూడో వ్యక్తి ఎంటరవడంతో.. ఆ కాపురం కూలిపోతుంది. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలనే చెప్పాలి.

Illicit Relations: 22 ఏళ్లుగా అత్తతో అక్రమ సంబంధం.. బెడ్ రూమ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..
Wife Caught Husband
Follow us on

అక్రమ సంబంధాలు.. కుటుంబాలను కూల్చివేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తుల ప్రాణాలను సైతం బలిగొంటున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా.. ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారిన దాఖలాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల సంసారంలో మూడో వ్యక్తి ఎంటరవడంతో.. ఆ కాపురం కూలిపోతుంది. ఇలాంటి ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలనే చెప్పాలి. తాజాగా అలాంటి షాకింగ్ రిలేషన్‌షిప్ వ్యవహారానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా నిలిచింది. ఓ వ్యక్తి తాను పెళ్లి చేసుకున్న భార్య అమ్మతో రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. అంటే.. అత్తతో వ్యవహారం నడుపుతున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 సంవత్సరాలుగా వీరి అక్రమ సంబంధం నడుస్తూ వచ్చింది. అయితే, తాజాగా విషయం.. తన భార్యకు తెలిసింది. ఇక ఆ తరువాత పరిస్థితి మామూలుగా లేదు. ఇదే విషయాన్ని బాధితురాలు స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ.. ‘నా భర్తకు, నా తల్లికి మధ్య 22 ఏళ్ల పాటు అక్రమ సంబంధం నడుస్తోంది. ఈ విషయం ఇంతకాలానికి బయటపడింది.’ అని 40 ఏళ్ల మహిళ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ‘నేను చాలా మోసపోయాను. జీవితాంతం ఇది నన్ను వేధిస్తుంటుంది. భర్త, తల్లి ఇద్దరూ కలిసి మోసం చేయడాన్ని జీర్ణినంచుకోలేకపోతున్నాను. ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఉండేదాన్ని. కానీ, ఇద్దరూ కలిసి నన్ను దారుణంగా మోసగించారు.’ అని వాపోయింది. అంతేకాదండోయ్.. వీరి అక్రమ సంబంధానికి గుర్తుగా పిల్లలు కూడా పుట్టారట. ఈ విషయం బాధిత మహిళకు ఇప్పుడు తెలిసింది.

బ్రిటన్‌కు చెందిన ఈ మహిళ.. 18 ఏళ్ల వయసులోనే తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుందట. ఆ తరువాత భర్త ఇంటికి షిష్ట్ అయ్యిందట. అయితే, ఆ సమయంలోనే తన భర్తకు, తన తల్లికి మధ్య సంబంధం మొదలైందని, బయటకు వెళ్తున్నానని చెప్పి తన తల్లితో కలిసేవాడని, బాధిత మహిళ వాపోయింది. అయితే, తాజాగా వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో వ్యవహారం బయటపడిందని తెలిపింది. బాధిత మహిళ ఇటీవల విహారయాత్రకు వెళ్లిందట. అక్కడి నుంచి తిరిగి రాగానే నేరుగా తన తల్లి ఇంటికి వెళ్లిందట. అయితే, అక్కడ తన భర్త, తన తల్లి ఇద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని చూసింది. దాంతో మొత్తం మ్యాటర్ రివీల్ అయ్యింది. ఈ దారుణాన్ని తట్టుకోలేకపోయిన మహిళ.. తన పిల్లలను తీసుకుని భర్త, తల్లి నుంచి దూరంగా వెళ్లింది. స్వంతంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..